‘కాకా’లు తీరిన యోధుల మధ్య కాషాయ ‘రేఖ’
మహిళా సీఎం ఢిల్లీకి కొత్త కాదు. బీజేపీకి కొత్తకాదు. కాకుంటే ఇప్పడు దేశంలో వున్న 14 బీజేపీ ముఖ్యమంత్రుల్లో రేఖ ఒక్కరే మహిళ. దాదాపు 27 యేళ్ళ తర్వాత దక్కిన ఢిల్లీ పీఠం పై ఎవర్ని కూర్చోబెట్టాలన్నది ‘కాషాయ’ నేతలకు పెద్ద సవాలే. కాకలు తీరినయోధుల్నో, కాకాలు పెట్టే బాబుల్నో కాకుండా, మహామహుల్ని కూల్చిన ’జెయింట్ కిల్లర్ల’ నో కాకుండా కొత్త ముఖం కోసమే చూశారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మను కూడా ఈ పీఠం వరించలేదు.
Read More